1.5 కోట్ల మంది జాతీయ గీతాలాపన వీడియోల అప్‌లోడ్

జాతీయ గీతాలాపనలో భారతీయులు సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ, విదేశాల్లోని 1.5 కోట్ల మందికి పైగా ‘జనగణమన’ పాడి, ఆ వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భారతీయులంతా ఆనందోత్సాహాలతో పాల్గొన్నట్లు తెలిపింది. 

భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఈ ఘనతను భారతీయులు దక్కించుకున్నట్లు వివరించింది. భారత దేశంలో ఉన్న సహజసిద్ధమైన సమైక్యత, బలం, సామరస్యాలకు ఇదే నిదర్శనమని తెలిపింది. జాతీయ గీతాన్ని కలిసికట్టుగా పాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 25న మన్ కి బాత్ కార్యక్రమంలో పిలుపిచ్చారు.

ఈ పిలుపు భారత దేశ ప్రజల మనసులు, హృదయాల్లో ఓ మంత్రంలా వ్యాపించిందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రముఖ కళాకారులు, సుప్రసిద్ధ పండితులు, అగ్ర నేతలు, ఉన్నతాధికారులు, పరాక్రమవంతులైన సైనికులు, ప్రముఖ క్రీడాకారులు, రైతులు, కార్మికులు, కూలీలు, సాధారణ ప్రజలు, దివ్యాంగులు ‘జనగణమన’ను ఆలపించి రికార్డు సృష్టించారని తెలిపింది.

కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ‘జనగణమన’ అన్ని దిక్కుల నుంచి ప్రతిధ్వనించిందని పేర్కొంది. భారత దేశానికి వెలుపల నివసిస్తున్న భారతీయులు కూడా ఎంతో ఆర్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది. జాతీయ గీతం మనకు గర్వకారణమని తెలిపింది.

ఈ కార్యక్రమం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా, భారత దేశ బలమైన సమైక్యతా సందేశం ప్రపంచానికి అందిందని పేర్కొంది. 2017 జనవరి 21న గుజరాత్‌లోని కగ్వాద్‌లో 5,09,261 మంది జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు సృష్టించారు. శ్రీ కోదల్ ధామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

2022 సంవత్సరం నాటికి నూతన, ఆత్మ నిర్భర్ భారత్‌ను నిర్మించాలన్న తన దృష్టిని ప్రధాని మోదీ తరచుగా పంచుకుంటున్నారు. ఈ  సందర్భాన్ని పురస్కరించుకుని, అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖలు పునరుజ్జీవన, స్వయం-ఆధారిత భారత్ కోసం కార్యకలాపాల సమితిని నిర్వహించాలని నిర్దేశించారు. .

ఆజాది కా అమృత్ మహోత్సవం భాగాలుగా కర్టెన్ రైజర్ కార్యకలాపాలను కేంద్రం ప్రారంభిస్తుంది.ఇది సరిగ్గా ఆగష్టు 15, 222కు 75 వారల ముందు 2022, మార్చి 12, 2021 న ప్రారంభమయ్యాయి. భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్య్రంకు గుర్తుగా, కేంద్రం అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రతిపాదిస్తుంది.