కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి నికారించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితం ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు కోసం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేసిన చోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు గతవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై ఆందోళనలు చేపట్టారు.
ఈ వివాదాల నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రలను భగ్నం చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తమ పోరాటాల ఫలితంగా, అక్కడ ఎటువంటి విగ్రహం ఏర్పాటు చేయకూడదని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే, తీవ్రమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఇది హిందువులు, బిజెపి కార్యకర్తలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు సాధించిన గొప్ప విజయం అని సోము చెప్పారు.
More Stories
జగన్ పై దాడి కేసులో నిందితునిగా బోండా ఉమా!
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఈసీ వేటు
సీఎం జగన్ను హత్య చేసేందుకే దాడి