ఎర్ర‌కోట అతిథులుగా భార‌త ఒలింపిక్ బృందం

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భార‌త బృందంతో ప్ర‌ధాని  నరేంద్ర మోదీ   స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15వ తేదీన భేటీకానున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్ల‌ను ప్ర‌త్యేక అతిథులుగా ఆయ‌న ఎర్ర‌కోట‌కు ఆహ్వానించ‌నున్నారు. ఆ స‌మ‌యంలో వారంద‌రితో వ్య‌క్తిగ‌తంగా మోదీ భేటీకానున్న‌ట్లు తెలుస్తోంది.

ఈసారి టోక్యో ఒలింపిక్స్‌కు భార‌త్ భారీ సంఖ్య‌లో అథ్లెట్ల‌ను పంపింది. సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్ల‌లో పాల్గొంటున్నారు. వీరితో పాటు వంద మంది కోచ్‌లు, అసిస్టెంట్ సిబ్బంది ఉన్నారు.

ఓ కార్య‌క్ర‌మంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. ఈసారి భారీ సంఖ్య‌లో భార‌త బృందాన్ని ఒలింపిక్స్ పంపిన‌ట్లు చెప్పారు. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఈ ఘ‌నత‌ సాధించ‌డం అద్వితీయ‌మ‌న్నారు. అనేక క్రీడ‌ల్లో మొద‌టిసారి క్వాలిఫై అయ్యామ‌ని, అర్హ‌త సాధించ‌డ‌మే కాదు, గ‌ట్టి పోటీ ఇస్తున్నామ‌ని కూడా ఆయ‌న తెలిపారు.

ఈ ఒలింపిక్స్‌లో ప్ర‌తి ఆట‌లోనూ భార‌త ఆత్మ‌విశ్వాసం కనిపించింద‌న్నారు. మ‌న ఆట‌గాళ్లు త‌మ‌క‌న్నా మేటి ర్యాంక్‌లో ఉన్నవారి పోరాడుతున్న‌ట్లు చెప్పారు. భార‌తీయ క్రీడాకారులు ఆత్మ‌విశ్వాసం, దీక్ష‌, ఉత్సాహం చాలా ఉన్న‌తంగా ఉన్న‌ట్లు తెలిపారు. స‌రైన ట్యాలెంట్‌ను గుర్తించి, ప్రోత్స‌హిస్తే ఇలాంటి ఆత్మ‌విశ్వాసం క‌నిపిస్తుంద‌ని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.