ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. భద్రతా రీత్యా మిజోరం వైపు ఎవరూ వెళ్లొద్దని తమ పౌరులకు అసోం ప్రభుత్వం సూచన చేసింది. సరిహద్దు వివాదంలో అసోం ప్రజలను రెచ్చగొట్టే విధంగా మిజోరం స్టూడెంట్స్, కొన్ని యూత్ ఆర్గనైజేషన్స్ ప్రకటనలు చేస్తున్నాయని అసోం ప్రభుత్వం పేర్కొన్నది.
మిజోరం పౌరుల వద్ద ఆటోమేటిక్ వెపన్స్ భారీగా ఉన్నాయని.. అసోం పోలీసుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో అది బయటపడిందని తెలిపింది. ఈ క్రమంలో మిజోరం రాష్ట్రానికి రాకపోకలు కొనసాగించొద్దని, ఆ రాష్ట్రంలో ఉంటున్న అసోం వాసులు జాగ్రత్త ఉండాలని సూచించింది.
అసోం, మిజోరం సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తటస్థ బలగాలను మోహరించడానికి ఇరు రాష్ట్రాలు ఇప్పటికే అంగీకరించాయి. కేంద్రం హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు ఒప్పందానికి వచ్చాయి. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి.
అసోం, మిజోరాం సరిహద్దులోని కచార్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్న ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మరణించారు. ఓ ఎస్పీ సహా 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఇరు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్రాల మధ్య గతేడాది ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఇలా ఉండగా, మిజోరాం భూభాగం నుండి తమ పోలీసులపై జరిగిన హింసాయుత దాడిలో మిజోరాం రాజ్యసభ ఎంపీ కె. వన్లాల్వేనా పాత్ర గురించి అస్సాం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అస్సాం పోలీసులు మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అందరూ చంపబడతారని ఆయన బెదిరించారు.
అస్సాం పోలీసుల ప్రకటన ప్రకారం, సిఐడి అధికారులతో సహా ఒక పోలీసు బృందంఢిల్లీకి బయలుదేరుతుంది “ఈ సంఘటన వెనుక కుట్రకు సంబంధించి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి రాజ్యసభ ఎంపి కె. వన్లలవేన మీడియా ఇంటర్వ్యూ వెలుగులో, కుట్రలో అతని చురుకైన పాత్రకు సూచన”.
అంతకుముందు, మిజోరాం ఉప ముఖ్యమంత్రి తవ్న్లుయా పొరుగున ఉన్న అసోం భూభాగాన్ని ఆక్రమించారనే వాదనలపై తమ ప్రభుత్వం ఎలాంటి వ్యాజ్యాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం చేసిన “ఆక్రమణ” ఆరోపణను తిప్పికొట్టాయి, ఈ సమస్యపై తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు.
More Stories
మందకొండిగా ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
14 ఏండ్ల బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
కేరళలో బర్డ్ ఫ్లూ .. కోయింబత్తూరులో అప్రమత్తం