ఆఫ్ఘన్ లో 6 నెలల హింసలో 1659 మంది మృతి

FILE - In this June 12, 2021 file photo, Afghan security personnel inspect the site of a bomb explosion in Kabul, Afghanistan. In a report released Monday, July 26, 2021, the United Nations said that more women and children were killed and wounded in Afghanistan in the first half of 2021 than in any year since the UN began keeping count in 2009. (AP Photo/Rahmat Gul, File)

ఆఫ్ఘనిస్తాన్‌లో గత ఆరు నెలల్లో జరిగిన హింసలో మరణించిన వారిపై ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న హింస ఫలితంగా 2021 మొదటి 6 నెలల్లో రికార్డు స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. 

ఈ సమయంలో 1.659 మంది మరణించారని, 3,254 మంది గాయపడ్డారని యుఎన్ నివేదిక పేర్కొన్నది. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన ప్రాణనష్టం కంటే ఇది 47 శాతం ఎక్కువ. ఈ ప్రమాదానికి ప్రభుత్వ వ్యతిరేక అంశాలు 64 శాతం, తాలిబాన్ 39 శాతం, ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ 9 శాతం, గుర్తుతెలియని సంస్థలు 16 శాతం ఉన్నాయి.

యూఎన్‌ నివేదిక ప్రకారం, 2021 మొదటి 6 నెలల్లో జరిగిన మరణాల్లో 32 శాతం మంది పిల్లలు ఉన్నారు. 1,214 మంది పిల్లలు గాయపడ్డారు. కాగా, మరణించిన వారిలో 14 శాతం మంది మహిళలు ఉన్నారు. గాయపడిన మహిళల సంఖ్య 508. 

అమెరికా-నాటో దళాల ఉపసంహరణ 95 శాతం పూర్తయింది. ఆగస్టు 31 నాటికి ఈ దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోతాయి.
మే-జూన్‌లో క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. చాలా మటుకు సంఘటనలు నగరాల శివారుల్లో జరిగాయని పేర్కొన్నది.

ఇలా ఉండగా, పాకిస్థాన్ దేశం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా తన రహస్య స్థావరాన్ని మార్చినట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం భారతదేశానికి తెలిపింది. ఉత్తర పాకిస్థాన్, దక్షిణ వజీరిస్థాన్ ల నుంచి పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమ రహస్య స్థావరాలను ఆప్ఘనిస్థాన్ దేశంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆఫ్ఘాన్ సర్కారు భారతదేశానికి సమాచారం అందించింది.

ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్ దేశాన్ని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో పదివేలమందికి పైగా జిహాది యోధులు పాకిస్థాన్ దేశం నుంచి ఆఫ్ఘనిస్థాన్ దేశంలోకి ప్రవేశించారని సమాచారం.గత కొన్ని వారాల్లో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మరణించిన, గాయపడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని వారి గుర్తింపు కార్డులను బట్టి వెల్లడైంది. ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా, బలూచిస్థాన్ మదర్సాల నుంచి ఆఫ్ఘాన్ జిహాద్ లో చేరారని తేలింది.