
‘మా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఓ కార్యక్రమాన్ని నిర్వించనున్నాం. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయాన్ని బట్టి నేను ముందుకెళ్తా. ఆయన ఏం ఆదేశిస్తే దానికి నేను కట్టుబడి ఉంటా’ అని వెల్లడించారు.
తాను అధికారంలో ఉన్నా లేకపోయినా బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. దీనికి పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించాలని కోరారు. “సీఎం పదవికి సంబంధించి ఆదేశాలు రాగానే దిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ తర్వాత పార్టీ కోసం కృషి చేస్తా. నాకు ఏ పనులు అప్పజెప్పినా వాటి కోసం చివరి క్షణం వరకు పని చేస్తా'” అని యడియూరప్ప పేర్కొన్నారు.
పార్టీ అగ్రనాయకత్వం తనపట్ల ఎంతో స్నేహభావంతో ఉంటూ, తనకు ఎంతో గౌరవం ఇస్తూ వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో 75 ఏళ్ళ వయస్సు మించినవారెవ్వరిని ఎటువంటి పదవులలో ఉండే అవకాశం లేకపోయినా తనకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.
కాగా తన ముఖ్యమంత్రి పదవి గురించి పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవ్వరు ఎటువంటి హడావుడి చేయవద్దని, కార్యక్రమాలు చేపట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీని బలోపేతం కావించడమే అందరి లక్ష్యంగా ఉండాలని హితవు చెప్పారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం