నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు పాత మం త్రుల వద్దకు వెళ్లి, వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొత్త మంత్రులతో భేటీ నిర్వహిస్తూ ఉద్వాసన పలికినంతమాత్రాన పాత మంత్రులు అసమర్థులు కారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొత్త శక్తి కావాలని స్పష్టం చేశారు.
కార్యాలయాలకు అందరూ ఉదయం 9.30గంటలకల్లా ఠంచనుగా రావాలనిపనిపైనే దృష్టిపెట్టాలని హితవు చెప్పారు. పనే ముఖ్యమని, మీడియా దృష్టిని ఆకర్షించాలనే విషవలయంలో పడవద్దని, అనవసర ప్రకటనలు చేయవద్దని మంత్రులకు సూచించారు. “,మీరు చేసే పనిని బట్టే మీకు ప్రచారం రావాలి” అని స్పష్టం చేశారు.
“క్రమశిక్షణతో కూడిన జీవనం గడుపుతున్న ప్రధాని తన అనుభవాల నుండి పారదర్శకతతో, ప్రజలకు అంకితమై పనిచేయాలని మాకు సూచించారని” ఈ సమావేశంలో పాల్గొన్న ఒక నూతన మంత్రి తెలిపారు.
కాగా, కరోనా ముప్పు తొలగిపోలేదని ప్రధాని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకుండా ప్రజలు గుంపులుగా తిరుగుతుండడంపై ఆందోళన వెలిబుచ్చారు. వ్యాక్సినేషన్తో పాటు కరోనాపై పోరు సాగుతోందని, ఈ సమయంలో చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు గుంపులుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఆయన ప్రస్తావించారు. చాలామంది మాస్క్ల్లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రులకు ప్రధాని ఉద్బోధించారు.
యువ టెక్కీలు అత్యంత వేగంగా సాంకేతికంగా పరిష్కార మార్గాలు సూచించడంతో ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. కృత్రిమ మేధ, స్మార్ట్ వేరబుల్స్, డిజిటల్ అసిస్టెంట్లు సామాన్య మానవుడికి చేరాలా ఉన్నత విద్యలో సాంకేతికను ప్రవేశపెట్టాలని సూచించారు. కృత్రిమ మేధతో కూడిన విద్యపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు.
More Stories
మోదీ – మమతా మధ్య పోరుగా మారిన బెంగాల్ ఎన్నికలు
కర్ణాటక రెబెల్ నేత ఈశ్వరప్పపై బీజేపీ వేటు
హైదరాబాద్ లో 5 లక్షలకు పైగా నకిలీ ఓట్ల తొలగింపు