1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ సివిల్ సర్వీస్ అధికారి అయిన సునీల్ కుమార్ ఎస్సీ కోటాలో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత ఇన్వెస్టిగేషన్ విభాగమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటుకు అధినేతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ”అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి నిమ్నవర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నారంటూ ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పీవీ సునీల్ కుమార్ తీరుతెన్నులు, అతని కార్యకలాపాలు, ప్రసంగాలపై గత కొంతకాలంగా అత్యంత తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంబేద్కర్స్’
ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడికి అప్పగించాలని నిర్ణయించుకుంది. అయితే సిఐడి విభాగానికి అధిపతిగా ఉన్న పీవీ సునీల్ కుమార్, గతంలో ఒక సభలో క్రైస్తవమతాన్ని, బ్రిటిష్ పరిపాలనను కొనియాడేవిధంగా చేసిన ప్రసంగం తాలూకు వీడియో బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఒక క్రైస్తవ పక్షపాతి ఇటువంటి కేసు అప్పగిస్తే నిష్పాక్షిక విచారణ ఎలా జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ కేసును మరో విభాగానికి అప్పగించారు.
వివాదం అంతటితో సద్దుమణగలేదు. పీవీ సునీల్ కుమార్ క్రైస్తవుడు అంటూ మరో వాదన ఊపందుకుంది. సునీల్ కుమార్ క్రైస్తవుడు అయివుండి షెడ్యూల్డ్ కులాల కోటాలో సివిల్స్ ఎలా సాధించారని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల పీవీ సునీల్ కుమార్ మీద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. అతను నిర్వహిస్తున్న ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభల్లో హిందూ మతం, ధర్మశాస్త్రాలు, పురాణాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు మహారాష్ట్రకు చెందిన లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ అనే సంస్థతో పాటు నరసాపురం లోక్ సభ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇటీవల కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా ఉంటూ ఒక సంస్థను ఏర్పాటు చేయడం, ఏదైనా సంస్థలకు ప్రాతినిధ్యం వహించడం వంటివి చేయరాదని 1966 నాటి ‘పోలీస్ బలగాలు – హక్కుల నియంత్రణ’ చట్టంలోని సెక్షన్ 3 కింద చెబుతోంది. అంతేకాకుండా సంస్థ ఏర్పాటు చేసిన సభావేదికలపై నుండి మతాలపై విమర్శలు చేయడం, దూషించడం వంటివి కూడా పీవీ సునీల్ కుమార్ చేస్తున్నారని లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అందుకు సాక్ష్యంగా పీవీ సునీల్ కుమార్ కు చెందిన ‘అంబేద్కర్స్ ఇండియా మిషన్’ ఫెస్బుక్ పేజీ నుండి సేకరించిన వీడియో లింకులు కూడా జతచేసింది. వీటి ఆధారంగా పీవీ సునీల్ కుమార్ మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153ఏ, 295ఏతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కిందా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కిందా కఠిన చర్యలు తీసుకునేవిధంగా ఏపీ పోలీస్ శాఖను ఆదేశించాల్సిందిగా కోరింది.
లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ చేసిన ఫిర్యాదు తాలూకు కాపీలు సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యూలేట్ కావడం మొదలైన కాసేపటికే అందులో పేర్కొన్న వీడియో లింకులు ‘అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ ఫేస్బుక్ పేజీ నుండి డిలేట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
పీవీ సునీల్ కుమార్ మీద ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత వీడియో లింకులు ‘అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ ఫేస్బుక్ పేజీ నుండి డిలీట్ అయ్యాయని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. దీంతో అసలు ఆ వీడియోలో ఏముంది? నిజంగా పీవీ సునీల్ కుమార్ ఎలాంటి తప్పు చేయకపోతే ఆ వీడియోలు ఎందుకు డిలీట్ అవుతాయి? వీడియోలు డిలీట్ చేసుకోవాల్సినంతగా పీవీ సునీల్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏమిటి? అన్న ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. ఈ క్రమంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ పేజీ నుండి డిలేట్ అయిన వీడియోలను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఐపీఎస్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా పీవీ సునీల్ కుమార్ ఏర్పాటు చేసిన అంబెడ్కర్ ఇండియా మిషన్ లక్ష్యం ఏమిటి? అణగారిన వర్గాలకు, ఎస్సీ సామజిక వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి కృషిచేసే సంస్థగా చెప్పుకునే ‘అంబెడ్కర్స్ ఇండియా మిషన్’ నిజానికి కేవలం మాల సామాజిక వర్గం కోసం మాత్రమే పనిచేసే సంస్థగా పేరుంది. అంతే కాకుండా పీవీ సునీల్ కుమార్ సైతం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన పీవీ సునీల్ కుమార్ “తాను మాల సామజిక వర్గాన్ని మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను” అని విస్పష్టంగా తెలిపారు. పైగా ఎస్సీ సామాజిక వర్గంలోకి ఇతరులను చేర్చడాన్ని వ్యతిరేకిస్తామని కూడా అన్నారు. ఎస్సీలకు సేవ చేస్తానంటూ కేవలం మాలలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించడం ద్వారా పీవీ సునీల్ కుమార్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్సీలలో 53 మాల, మాదిగ, రెల్లి, బెస్త వంటి 53 ఉపకులాల పరిస్థితి ఏమిటి? వారి గురించి అంబేద్కర్స్ ఇండియా మిషన్ కు అవసరం లేదా? – ఈ ప్రశ్నలన్నీ ప్రజల్లో తలెత్తుతున్నాయి.
More Stories
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్