కరోనా ఉధృతి తగ్గని నేపథ్యంలో, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేజీ టూ పీజీ వరకు ఆన్లైన్లోనే బోధన కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్లైన్లోనే బోధన కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు జులై 1వ తేదీ నుంచి కేజీ టూ పీజీ వరకు ఆన్లైన్లోనే బోధన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
టీశాట్, దూరదర్శన్ యాప్ లో పాఠాలు ఉంచుతామని తెలిపారు. సెట్స్కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఇంతకు ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జులైలో యూనివర్శిటీల వారిగా జరగాల్సిన డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు.
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను కూడా జులై నెలలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలు రద్దు కావని మంత్రి సబిత స్పష్టం చేశారు. టీచర్ల హాజరుపై మంత్రి స్పష్టతనిస్తూ 50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరు కావాలి. రోజు విడిచి రోజు టీచర్లు విధులకు హాజరు అవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
ఇందుకు సంబంధించిన జీవో జారీ అవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రయివేటు పాఠశాలలు తప్పనిసరిగా 46 జీవోను అమలు చేయాలని, ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
More Stories
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి
సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలి
తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ