కాగా, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీలో తప్ప దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రేషన్ పథకం అమలవుతున్నది. అయితే రాజకీయ కారణాలతో సీఎం మమత బెంగాల్లో, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
మరోవంక, ముకుల్ రాయ్, ఆయన కుమారుడు సుభ్రంగ్సు రాయ్.. తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ముకుల్ రాయ్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సన్మానించారు. ఇతరుల మాదరిగా ముకుల్ రాయ్ దేశద్రోహి కాదని ఆమె స్పష్టం చేశారు.
‘‘కుమారుడు తిరిగి సొంతింటికి చేరుకున్నాడు. ముకుల్ రాయ్ ఇంటి పిల్లవాడు. తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు” అని మమతా ప్రకటించారు.
2017లో తృణమూల్ను వీడిన ముకుల్ రాయ్.. మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. బీజేపీని వీడిన తర్వాత ఎంతో సంతోషంగా ఉందని చెబుతూ తాను బీజేపీలో ఇమడలేకపోతున్నానని పేర్కొన్నారు. సీఎం మమతతో తనకెలాంటి విబేధాలు లేవని ముకుల్ రాయ్ స్పష్టం చేశారు.
More Stories
అమిత్ షాకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్