ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పర్యావరణ అసమతుల్యత, వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఎన్విరాన్మెంట్ రిస్క్ ఔట్లుక్- 2021 నివేదిక ప్రకారం, ఆసియాలోని 100 నగరాల్లో 99 నగరాలు వివిధ పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.
ఎక్కువ పర్యావరణ నష్టాలను ఎదుర్కొంటున్న 100 నగరాల్లో 43 భారతదేశంలో, 37 చైనాలో ఉన్నాయి. మొదటి 20 నగరాల్లో రెండు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. కరాచీ 12 వ, లాహోర్ 15 వ స్థానం పొందాయి.
ఈ నివేదిక ప్రకారం, పర్యావరణ రిస్క్ అధికంగా ఉన్న జాబితాలో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, చెన్నై మూడవ స్థానంలో ఉన్నది. ఆగ్రా ఆరో స్థానంలో, కాన్పూర్ పదో స్థానంలో ఉన్నాయి. జైపూర్ 22, లక్నో 24, బెంగళూరు 25, ముంబై 27 వ స్థానంలో ఉన్నాయి.
దేశంలో ప్రతి ఐదవ మరణానికి వాయు కాలుష్యం కారణం. ఈ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రూ.264,864 కోట్ల నష్టాన్ని చవిచూసింది. నీటి కాలుష్యం కారణంగా దాదాపు 400,000 మంది మరణించారు. ఆరోగ్యం కోసం దాదాపు రూ.66,216 కోట్లు ఖర్చు చేశారు.
ఈ జాబితాలో అత్యంత చెత్త స్థానం ఇండోనేషియాలోని జకార్తా నగరానిది. ఈ నగరంలో కాలుష్యం స్థాయి చాలా భయంకరంగా ఉన్నది. అదనంగా వరదలు, వాతావరణ మార్పుల సమస్యను ఈ నగరం ఎదుర్కొంటున్నది.
మరో రెండు ఇండోనేషియా నగరాలు.. సురబయ, బాండుంగ్ వరుసగా 4, 8 వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో అంతరించిపోతున్న 20 నగరాల్లో 14 ఐరోపాలో ఉన్నాయి. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ నగరం సురక్షితమైన నగరంగా ఈ సూచికలో 576 వ స్థానంలో ఉన్నది.
కాగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, దేశంలో కాలుష్యం గురించి ఆందోళన చెందుతూనే ఉన్నది. ఢిల్లీ, హర్యానాతోపాటు పరిసర రాష్ట్రాల పరిస్థితి ఘోరంగా ఉండగా, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శ్వాసకోశ వ్యాధుల కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరిగిందని నివేదిక పేర్కొన్నది.
ఇలాఉండగా, స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ వరల్డ్ క్యాపిటల్ సిటీ ర్యాంకింగ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలో 10 వ అత్యంత కలుషితమైన నగరం, రాజధానిగా ఢిల్లీ నిలిచింది. 2019 నుంచి 2020 వరకు ఢిల్లీలో గాలి నాణ్యత దాదాపు 15 శాతం మెరుగుపడింది.
More Stories
ఎన్నికల వేళ పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం
సీబీఎస్ఈలో కొనసాగిన బాలికల హవా