
ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సిబిఐ న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరిగింది. గతంలో కోర్టు ఆదేశాల మేరకు జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.
జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సిబిఐ ని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని తెలిపారు. సిబిఐ కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుందని, పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసుతో సంబంధం లేదని వివరించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేశారు.
రఘరామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు. రఘురామ పిటిషన్కు విచారణార్హత లేదని పేర్కొన్నారు.
ఆయన బ్యాంకులకు రూ 900 కోట్లు ఎగ్గొట్టడంతో సీబీఐ కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాలను పిటిషనర్ కోర్టు ముందు దాచారని పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పిటిషన్ను కొట్టివేయాలని సిబిఐ కోర్టును కోరారు.
..
రఘురామరాజుపై ఎపి లో అనేక కేసులున్నాయని విన్నవించారు. మరోవైపు సిబిఐ కూడా న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 14 కి వాయిదా వేసింది.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం