కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో తమ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రిత్వ శాఖ పలు చర్యలను తీసుకుంది.
కార్మిక రాజ్యబీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.), ఉదనపు ప్రయోజనాలను ప్రకటించింది. ఉద్యోగి, లేదా కార్మిద్యోగుభల విష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.)ల ద్వారా కార్మికులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే మరింత విస్తృత స్థాయిలో సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలను ప్రకటించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఇ.ఎస్.ఐ.సి. కింద బీమా పొందిన వ్యక్తి తన విధి నిర్వహణలో గాయాలతో మరణించినా లేదా అంగవి
పిల్లలకు అయితే వారికి 25 ఏండ్ల వయస్సు వచ్చేవరకూ పెన్షన్ ఇస్తారు. అదే ఆడపిల్లకైతే తన వివాహం వరకూ ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇ.ఎస్.ఐ.సి. పథకం కింద బీమా సదుపాయం ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగికి కోవిడ్ వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే ఇ.ఎస్.ఐ.సి. ఆన్ లైన్ పోర్టల్ లో పేర్లు నమోదైన ఉద్యోగి కుటుంబ సభ్యులందరికీ అవే ప్రయోజనాలను, అవే పద్ధతిలో వర్తింపజేయాలని కార్మిక, ఉపాధి కల్పనా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
అయితే, ఈ కింద సూచించిన అర్హతాపరమైన షరతులకు లోబడి ఈ ప్రయోజనాలను వర్తింపజేస్తారు:
- బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరగడానికి కనీసం 3 నెలలు ముందుగా ఇ.ఎస్.ఐ.సి. ఆన్ లైన్ పోర్టల్.లో తన పేరును నమోదు చేసుకుని ఉండాలి.
- బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరిగిన సంవత్సరానికి మునుపటి ఏడాదిలో నియమితుడై ఉండి, తన వేతనం నుంచి కనీసం 78 రోజుల పాటు ఇ.ఎస్.ఐ.సి. చందా జమ అయి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్న బీమా వ్యక్తులు కోవిడ్ వ్యాధితో మరణించిన పక్షంలో సదరు వ్యక్తులపై ఆధారపడిన వారికి, బీమా వ్యక్తుల దినసరి వేతనంలో 90 శాతం చొప్పున మొత్తం నెలవారీగా జీవితాంతం చెల్లిస్తారు.
- ఈ పథకం గత ఏడాది (2020) మార్చి 24 నుంచి రెండేండ్ల పాటు అమలులో ఉంటుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలోని డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇ.డి.ఎల్.ఐ.) పథకం కింద సభ్యుడైన వ్యక్తి మరణించిన పక్షంలో సదరు వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యలందిరికీ ఇ.డి.ఎల్.ఐ. పథకం ప్రయోజనాలు పొందేందుకు అర్హత ఉంటుంది.
- ప్రస్తుతం ఈ పథకం కింద గ్రాట్యుటీ చెల్లింపునకు కనీస సర్వీసు ఉండాలన్న షరతులేకుండా ఈ ప్రయోజనాలను అందిస్తున్నారు. అలాగే, ఇ.పి.ఎఫ్ అండ్ ఎం.పి. చట్టం నిబంధనల కింద కుటుంబ పెన్షన్ చెల్లిస్తున్నారు. కార్మికులు అస్వస్థులై విధులకు హాజరు కాలేని పక్షంలో సదరు కార్మికులుకు తమ వేతనంలో 70 శాతం మొత్తాన్ని సిక్నెస్ బెనిఫిట్ గా 91 రోజులపాటు చెల్లిస్తున్నారు.
More Stories
ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్
నేటి నుండి పార్లమెంట్ భద్రత చేబడుతున్న సిఐఎస్ఎఫ్
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు