పాకిస్తాన్లో మైనార్టీల మత స్వేచ్ఛపై దాడులు జరుగుతుండటం పట్ల అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా తన వార్షిక నివేదికలో ముఖ్యంగా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షను అమలుపర్చడం వల్ల పాకిస్తాన్లో మైనార్టీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నదని పేర్కొన్నది.
పౌర సమాజం నుంచి అందిన ఫిర్యాదులను ఉటంకిస్తూ, దైవదూషణ చట్టాల కారణంగా ఈ ఏడాది కనీసం 35 మందికి మరణశిక్ష విధించినట్లు పేర్కొన్నది. 2019 సంవత్సరంలో ఈ చట్టం ప్రకారం 82 మందికి జీవిత ఖైదు, 29 మందికి మరణశిక్ష విధించారని విచారం వ్యక్తం చేసింది.
సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఎన్జీఓ ప్రకారం, 2019 సంవత్సరంలో దైవదూషణ చట్టం ప్రకారం 199 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. దేశ చరిత్రలో ఒక ఏడాదిలో ఈ చట్టం కింద దోషులుగా నిర్ధారించబడిన వారిలో ఇదే అత్యధికం. దోషుల్లో ఎక్కువ మంది షియా (70 శాతం కేసులు), అహ్మదీయ ముస్లింలు (20 శాతం కేసులు) ఉన్నారు.
సున్నీ ఆధిపత్య ఇస్లామిక్ దేశంలో న్యాయస్థానాల నిర్ణయాలలో అహ్మదీయ ముస్లిం సమాజానికి ప్రాథమిక హక్కులు కూడా లేవు. జూలైలో యుఎస్ పౌరులను హత్య చేసినట్లు నివేదికలో పేర్కొన్నది. అలాగే, అహ్మదీ ముస్లిం తాహిర్ నసీమ్పై దైవదూషణ కేసు కూడా లేవనెత్తింది.
అమెరికా ప్రకటించిన ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఏ-జాన్వి, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ , ఇతర పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా షియా హజారా సమాజంలోని ప్రజలు హింసకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
More Stories
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి