మోదీ, ఫడ్నవీస్‌పై అనుచిత వ్యాఖ్యలు…54 మందిపై కేసు

ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, పలువురు బీజేపీ నాయకులపై సోషల్‌మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి , అడ్వకేట్‌ ప్రదీప్‌ గవాడే మే 10వ తేదీన పుణె సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రధాని మోదీ, మాజీ సీఎం ఫడ్నవీస్‌, ఆయన భార్య అమృతా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ గురించి సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్‌ చేసిన 54 మందిపై గవాడే ఫిర్యాదు చేశారు. 

బీజేపీ ఆఫీస్‌ బేరర్‌ వినీత్‌ బాజ్‌పాయ్‌ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో 54 మందిని నిందితులుగా చేర్చినట్లు సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ దగదు హేక్‌ వివరించారు.