మైనింగ్‌ పేలుళ్లలోజగన్ సమీప బంధువు అరెస్ట్ 

మైనింగ్‌ పేలుళ్లలోజగన్ సమీప బంధువు అరెస్ట్ 

పది మంది కూలీల బతుకులను ఛిద్రం చేసిన కడప జిల్లా మామిళ్లపల్లి ముగ్గురాళ్ల మైనింగ్‌ పేలుడుకు సంబంధించి ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సుదారుడు వైఎస్‌ ప్రతాపరెడ్డిని అరెస్టు చేశారు. ఈయన సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి స్వ యానా పెదనాన్న. 

వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరుతో 2001 నవంబరులో మామి ళ్లపల్లిలో మైనింగ్‌ లీజు జారీ కా గా నిర్వహణ హక్కులను బి.మ ఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వర్‌రెడ్డికి 2013లో జీపీఏ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే మై నింగ్‌ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి భూగర్భ బెరైటీస్‌ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఈనెల 8న పులివెందుల నుంచి పేలుళ్ల కోసం జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను తీసుకొచ్చి దింపుతుండగా జరిగిన పేలుడులో 10 మంది మృతిచెందారు. 

ఈ పేలు డు పదార్థాలు వైఎస్‌ ప్రతాపరెడ్డి మ్యాగజైన్‌ నుంచి ర వాణా చేసినట్లు కడప ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు. ‘ఈయనకు పేలుడు పదార్థాల అమ్మకా లు, నిల్వ చేసే మ్యాగజైన్లు, రవాణా లైసెన్సులు ఉన్నాయి. ఈయన పులివెందులకు చెందిన యర్రగుడి రఘునాథరెడ్డికి పేలుడు పదార్థాలు, రెండు మ్యాగజైన్లలో భద్రపరుచుకోవడానికే అగ్రిమెంటు ఇచ్చారు’ అని పేర్కొన్నారు.

ప్రతాపరెడ్డికి చెందిన లైసెన్సు మ్యాగజైన్లలో పేలుడు పదార్థాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను అధిక లాభానికి లైసెన్సు లేనివారికి రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయిస్తూ వస్తున్నారు. 8న ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని లక్ష్మిరెడ్డికి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయించారు.

వాటిని కలసపాడు మండలం, పోరుమామిళ్ల సమీపంలోని కొండగంగమ్మ మైనింగ్‌కు ఎలాంటి భద్రత లేని కారులో తీసుకొని వెళ్లి దించుతుండగా ఈ పేలుళ్లు జరిగాయని డీఎస్పీ వివరించారు. వైఎస్‌ ప్రతాపరెడ్డి ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధం గా లైసెన్సు లేని వారికి పేలుడు పదార్థాలు విక్రయించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం చేశారు.

ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ప్రతాపరెడ్డిని మంగళవారం అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో సోమవారం అరెస్టు చేసిన నాగేశ్వర్‌రెడ్డి, రఘునాథరెడ్డిలకు 14 రోజులు రిమాండుకు కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.