సమన్వయం లేని మహా వికాస్ అగాడీ ప్రభుత్వం

మహా వికాస్ అగాడీ ప్రభుత్వంలో సమన్వయం లేదని అందుకే మరాఠా రిజర్వేషన్ బిల్లును కోర్టు నిలిపివేసిందని భారతీయ జనతా పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. మహారాష్ట్రలోని మరాఠా సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టం చేసింది. 

రాష్ట్ర అసెంబ్లీకి ఇలాంటి చట్టాలు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది. ఈ విషయమై  నాగ్‌పూర్‌లో మీడియాతో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ రిజర్వేలషన్లు అవసరమే అని హైకోర్టు చెప్పిన అనంతరం అసెంబ్లీలో చట్టం అయిందని గుర్తు చేశారు.

ఇదే కేసు సుప్రీంకోర్టులో తిరగబడిందని చెబుతూ ఈ చట్టాన్ని రద్దు చేయకుండా స్టే విధించండని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామని, కానీ లాభం లేక పోయినదని విచారం వ్యక్తం చేశారు.  దీనికంతటికీ ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. మహా వికాస్ అగాడీ మధ్య సరైన సమన్వయం లేదు. ఈ కేసు వాదించడానికి ఒక్కోసారి లాయర్ కూడా లేరని ధ్వజమెత్తారు.

కాగా, అయితే మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని సుప్రీం రద్దు చేయడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.