5జీ ట్రయల్స్ నిర్వహించడానికి టీఎస్పిలకు వారి స్వంత స్పెక్ట్రం 800 MHz, 900 MHz, 1800 MHz, 2500 MHz 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి కూడా కేంద్రం అనుమతించింది. 5జీ ట్రయల్స్ పట్టణ ప్రాంతాలలో మాత్రమే కాకుండా పల్లె ప్రాంతాలలో కూడా పరీక్షలు నిర్వహించవచ్చు.
5జీ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. దేశీయంగా అభివృద్ది చేసిన 5జీ టెక్నాలజీని ట్రయల్స్ నిర్వహించడానికి డీఓటీ ప్రోత్సహిస్తుంది. దేశీయంగా 5జీ టెక్నాలజీని ఐఐటి మద్రాస్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ(సిఇవిఐటి), ఐఐటి హైదరాబాద్లు అభివృద్ధి చేస్తున్నాయి.
ఈ 5జీ టెక్నాలజీ వల్ల టెలిమెడిసిన్, టెలీడ్యూకేషన్, ఆగ్మెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ హోమ్స్ వంటి రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ టెక్నాలజీ డేటా డౌన్లోడ్ వేగం 10 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ కేవలం స్మార్ట్ఫోన్కే పరిమితం కాకుండా అన్ని రంగాలలో విప్లవాన్ని సృష్టించనున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.
More Stories
వయనాడ్ నుంచి ప్రజలు రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
నెస్లేపై విచారణకు ఆదేశించిన కేంద్రం