ఎన్నికలను ప్రజాస్వామ్యం పండుగగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఎనిమిదో దశ పోలింగ్ గురువారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు.
కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యం పండుగను సుసంపన్నం చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 35 శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మోదీ ఇచ్చిన ట్వీట్లో, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జరుగుతోందని, కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యం పండుగను పరిపుష్టం చేయాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు అమలవుతున్నాయి. గురువారం ఉదయం 11 గంటల వరకు 37.80 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. మొత్తం ఎనిమిది దశల్లో పోలైన ఓట్లను మే 2న లెక్కిస్తారు.
మొత్తం 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో నార్త్ కోల్కతా, రవీంద్ర సారణి, బిధాన్ సారణిలలో బాంబు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడినట్లు ఇంతవరకూ సమాచారం లేదు. అయితే ఈ ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు.
అలాగే ఎన్నికల సంఘం ఈ ఘటనలపై వెంటనే నివేదిక పంపాలని సంబంధిత అధికారులను కోరింది. కాగా ఈ బాంబు దాడులకు టీఎంసీ కార్యకర్తలే కారణమని బీజేపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. బాంబు దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
More Stories
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్
సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా