తెలంగాణలోని 16 మావో అనుబంధ సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని ‘చట్టవిరుద్ధ సంఘాలు(అన్లాఫుల్ అసోసియేషన్స్)’గా గుర్తించి నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది.
అందుకు సంబందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. మార్చి 30 నుంచి ఏడాదిపాటు ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, రాష్ట్రంలోని 33 జిల్లాలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
నిషేధించబడిన సంస్థలు:
1. తెలంగాణ ప్రజా ఫ్రంట్(టీపీఎఫ్),
2. తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య(టీఏకేఎస్),
3. తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ),
4.డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్(డీఎ్సయూ),
5.తెలంగాణ విద్యార్థి సంఘం(టీవీఎస్),
6.ఆదివాసి స్టూడెంట్ యూనియన్(ఏఎస్ యూ),
7.రాజకీయ ఖైదీల విడుదల కమిటీ(సీఆర్పీపీ),
8. తెలంగాణ రైతాంగ సమితి(టీఆర్ఎస్),
9. తుడుం దెబ్బ(టీడీ),
10. ప్రజా కళా మండలి(పీకేఎం),
11. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్(టీడీఎఫ్),
12. ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్(ఎ్ఫఏహెచ్ఎ్ఫవో),
13. సివిల్ లిబర్టీస్ కమిటీ(పౌర హక్కుల సంఘం),
14. అమరుల బంధుమిత్రుల సంఘం(ఏబీఎంఎస్),
15. చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్),
16. రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్(విప్లవ రచయితల సంఘం- ఆర్డబ్ల్యూఏ):
పైన్ పేర్కొన్న సంస్థలు , ప్రజా సంఘాలు అనే ముసుగులో నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)కు అనుబంధంగా పనిచేస్తూ, చట్ట వ్యతిరేక, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, కార్యకర్తలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉసిగొల్పుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.
More Stories
చిక్కుల్లో వినోద్ కుమార్ నామినేషన్
రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు