రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెలుగు అకాడమీ ఉద్యోగుల ఆస్తుల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగుల పంపకం, ఆస్తులు, అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది.
విభజన చట్టం 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ విభజన అంశం న్యాయపరిధిలోకి రాదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం విచారించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే కేంద్రం జోక్యం చేసుకునేలా చట్టంలో ఉందని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ వాదించారు.
ఇరు రాష్ట్రాలు నెల రోజుల్లో తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే అప్పడు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

More Stories
హైదరాబాద్పై కాంగ్రెస్ మార్క్ దోపిడీ క్యూర్ చట్టం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు