![](https://nijamtoday.com/wp-content/uploads/2021/02/Justice-Gogoi1.jpg)
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్కు క్లీన్చిట్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. గొగొయ్పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
మాజీ చీఫ్ జస్టిస్ గొగొయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉన్నదని ఏకే పట్నాయక్ రిపోర్టు స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ సంపాదించలేకపోయిందని చెప్పింది.
ఎన్ఆర్సీలాంటి కేసుల్లో జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం గుర్తు చేసింది. అందువల్ల తాము ఈ కేసును మూసివేస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ గొగొయ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడానికి కాదని కూడా కోర్టు ఈ సందర్భంగా చెప్పింది.
More Stories
మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నేడే
ఆన్లైన్ వార్తలపై నియంత్రణకు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు!
భారత్లో ఏటా 2.5 శాతం పెరుగుతున్న క్యాన్సర్ కేసులు