ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నారని చెప్పగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. చర్చిల నిర్మాణానికి టెండర్లా? అని ప్రశ్నిస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యారని, ప్రభుత్వమే టెండర్లు పిలవడం ఎలా సాధ్యమని మోదీ అన్నారని రఘురామ చెప్పారు. చర్చిల టెండర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజును మోదీ కోరారు.
ఈ రోజు ప్రధానిని కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన్నట్లు రఘురామ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులు, దేవాలయాలపై దాడుల గురించి 25 పేజీల నివేదికను ప్రధానికి అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.
రాజధాని మార్పు మొదలుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, దేవాలయాలపై దాడులు ఇలా అనేక విషయాలను ప్రధానికి ఆయన వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని అంటూ ఆయన రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు సానుకూల నిర్ణయం తీసుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీతో 18 నిమిషాల సమావేశం అద్భుతంగా సాగిందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ‘నేను లేవనెత్తిన అన్ని అంశాలకు మోదీ సానుకూలంగా స్పందించారు. మీ చేతులపై శంకుస్థాపన చేసిన అమరావతిని నిలిపివేస్తే పేద రైతులకు అన్యాయం జరుగుందని చెప్పా’ అని వెల్లడించారు.
ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలకు రూ 50,000 మేరకు ఖర్చు చేశారని, ఇప్పుడు అక్కడి నుండి రాజధానిని మరో ప్రాంతంకు మార్చితే ప్రభుత్వంకు ఉచితంగా భూములు ఇచ్చిన రైతులకు లక్ష కోట్ల రూపాయల మేరకు పరిహారం చెల్లింపు వలసి ఉంటుందని ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై న్యాయపోరాటం జరుగుతున్న విషయానికి కూడా ఆయనకు తెలిపినట్లు చెప్పారు.
ఏపీ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాడని, ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సహితం ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పిన్నట్లు పేర్కొన్నారు.
More Stories
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలపై సిబిఐ దర్యాప్తు
కాంగ్రెస్ వస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం.. అందుకే 400 సీట్లు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఈసీ ఆదేశాలు ఇవ్వలేదు