కరోనా ప్రభావంతో కొన్నాళ్లు నిలిచి పోయిన రైల్వే సేవలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రైళ్లలో ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని భారతీయ రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. కరోనా లాక్డౌన్ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆంక్షలను సడలిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. రైళ్లలో ఈ-కేటరింగ్ సేవలను మళ్లీ ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమయింది. ఈ సేవల వల్ల రైల్వే ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తమ బెర్తు వద్దకే తెప్పించుకోవచ్చు.
ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ వెబ్సైట్ https://www.ecatering.irctc.co.in లేదా 1323 నెంబర్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ యాప్ అయిన Food on Track యాప్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ సేవలు దేశ వ్యాప్తంగా మొత్తం ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ముందుగా 30 రైల్వే స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించి 250 రైళ్లకు మాత్రమే కేటరింగ్ సేవలను రైల్వే శాఖ అందించనుంది. తర్వాత దశలవారీగా దేశ వ్యాప్తంగా కేటరింగ్ సేవలను ప్రారంభించనుంది.
More Stories
భారత వృద్ధి రేటు అంచనాలను 7 శాతంకు పెంచిన ఐరాస
ప్రత్యేక కోర్టు విచారణలో ఉంటే ఈడీ అరెస్టు చేయకూడదు
పనిమనిషి దగ్గర దొరికిన డబ్బుతో ఝార్ఖండ్ మంత్రి అరెస్ట్