దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, ఆరు సార్లు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వీరభద్ర సింగ్ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, కాకపోతే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని 86 ఏళ్ల వీరభద్ర సింగ్ తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ పని చేశారు. 2017లో అధికారం నుంచి దిగిపోయిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. ‘‘ఇకపై ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పని చేస్తా’’ అని వీరభద్ర సింగ్ తన నియోజకవర్గం ఆర్కిలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
ఆయనపై బీజేపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం వాటి విచారణ కొనసాగుతోంది. అయితే వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడుగా వీరభద్ర సింగ్ ఉన్నారు. 2012 నుంచి 2017 వరకు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వ్యహరించారు. 1983 నుంచి 1990, 1993 నుంచి 98, 2003-07కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1962, 67, 71, 80, 2007లో లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు