
‘‘తిరుపతి ఎన్నికల్లో ప్రతి మండలానికి ఒక బృందం పనిచేయాలి. కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలి’’ అని నిర్ణయించారు. వచ్చే నెలలో తిరుపతిలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని, దీనికి ప్రతి నియోజకవర్గం నుంచి జనసమీకరణ జరగాలని ఈ సందర్భంగా ప్రణాలికను రూపొందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, ప్రకటించిన ఏ పథకాన్ని సజావుగా అమలు చేయడం లేదని, ప్రకటనలతో భ్రమింపజేస్తోందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా చేస్తున్న ఎదురుదాడిని సమర్థంగా తిప్పి కొట్టాలని, ప్రజల్లోకి పార్టీ వాదనలు బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడానికి తటస్థంగా ఉన్న మాజీ నాయకులు, అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొంటున్న నేతలను సంప్రతించి, బీజేపీలోకి తీసుకురావాలని కోర్ కమిటీ నిర్ణయించింది.
More Stories
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై రేపు సుప్రీంలో విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్
రాజధాని భూసేకరణను, సచివాలయాల వ్యవస్థను తప్పుపట్టిన కాగ్