డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర మంత్రి అల్లుడు!

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌‌ను ఎన్‌సీబీ అధికారులు ఓ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. సమీర్‌ను ఒకరోజంతా క్షుణ్ణంగా విచారించిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండే వెల్లడించారు. 
 
పశ్చిమ బంద్రాలో ఓ కొరియర్‌ నుంచి 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న వారం రోజుల్లోనే సమీర్‌ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అనంతరం జరిగిన ఆపరేషన్‌లో ఖార్‌లోని కరణ్ సజ్నానీ అనే  వ్యక్తి ఇంటి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 
 
బ్రిటిష్ పౌరుడైన సజ్ఞాన్నితో పాటు మరో ఇద్దరు సోదరీలు రాహిలా ఫర్నిచర్‌వాలా, షైస్టా ఫర్నిచర్‌వాలా… మచ్చడ్ పానావాలాకి చెందిన రామ్ కుమార్ తివారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తుండగా సమీర్ పేరు బయటకికి వచ్చింది.  ఆన్ లైన్ లో గూగుల్ పే ద్వారా సజ్ఞానికి ఖాన్ కొంత మొత్తం చెల్లించిన్నటు బైటపడింది.
ఆ మొత్తాన్ని డ్రగ్స్ కోసమే చెల్లించి ఉండవచ్చని భావిస్తున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా ప్రశ్నించిన పోలీసులు చివరికి ఆయనను కూడా అరెస్ట్ చేశారు.  ఇలా ఉండగా, ఎన్సీపీ నాయకుడైన నవాబ్ మాలిక్ గత ఏడాది అక్టోబర్ లో మహారాష్ట్ర పోలీసులు నమోదు చేస్తున్న లెక్కలేనన్ని కేసులతో విరక్తి చెంది రిపబ్లిక్ టివి ఎడిటర్ అర్ణబ్  గోస్వామి ఆత్మహత్య చేసుకోటాడని అంటూ జోస్యం చెప్పారు.