వ్యక్తిగత ఐటీ రిటర్న్ల దాఖలు గడువును మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్ల (ఐటీఆర్) గడువును డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 10వ తేదీ వరకూ పొడిగించింది.
అకౌంట్ల ఆడిట్ అవసరం లేని, సహజంగా ఐటీర్-1, ఐటీఆర్-4 ఫార్మ్స్ ద్వారా రిటర్న్లు దాఖలు చేసే వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆదాయం పన్ను శాఖ బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
వ్యక్తిగత చెల్లింపులకు 10 రోజుల గడువు ఇచ్చింది. వ్యక్తిగత చెల్లింపుదారులు జనవరి 10 వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని సూచించింది. అదేవిధంగా సంస్థలు తమ ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు 15 రోజులు గడువును పెంచింది. ఫిబ్రవరి 15లోపు రిటర్న్లు దాఖలు చేయాలని ఆయా సంస్థలకు సూచించింది.
కోవిడ్ కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఈ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే, జీఎస్టీ కింద 2020 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక రిటర్న్ల దాఖలు గడువును కూడా 2021 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు.
More Stories
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై 9న తీర్పు
ఝార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ బెయిల్ నిరాకరణ