ప్రపంచంలో కశ్మీరీ కేసర్ (కశ్మీరీ కుంకుమ పువ్వు)కు ప్రత్యేక స్థానం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇతర దేశాల్లో లభించే కుంకుమ పువ్వుకు, కశ్మీర్లో ఉత్పత్తయ్యే కుంకుమ పువ్వుకు నాణ్యత విషయంలో చాలా తేడా ఉంటుందని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని నాణ్యత విషయంలో ప్రపంచంలో లభించే ఇతర అన్ని కుంకుమ పువ్వులకంటే కశ్మీర్ కుంకుమ పువ్వు చాలా విశిష్టమైనదని పేర్కొన్నారు.
కశ్మీరీ కుంకుమ పువ్వు ఇతర దేశాల్లో దొరికే కుంకుమ పువ్వుకు పూర్తిగా భిన్నమైనదని ప్రధాని తెలిపారు. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ఈ ఏడాదే వచ్చిందని, ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఈ పువ్వుకు న్యాయమైన స్థానం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆత్మనిర్బర్ భారత్ పథకంలో భాగంగా దేశ ప్రజలు కశ్మీరీ కుంకుమ పువ్వును కొనాలని కోరారు. కశ్మీరి కుంకుమ పువ్వు గురించి అక్బర్ సంస్థానంలోని అబుల్ ఫజల్ మొదటిసారి వర్ణించారని ప్రధాని గుర్తుచేశారు.
ఈ కశ్మీరీ కుంకుమ పువ్వు జమ్ముకశ్మీర్లోని పుల్వామా, బుద్గామ్, కిస్ట్వార్ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. ఈ పువ్వును పాయసం, హల్వా, బిర్యానీ లాంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. కశ్మీరీ కుంకుమ పువ్వును ఉపయోగించడం ద్వారా వంటకాలకు చక్కని రంగు, రుచి రావడంతోపాటు కమ్మని సువాసనలు వెదజల్లుతాయి. అందుకే కశ్మీరీ కుంకుమ పువ్వుకు అంతటి ప్రత్యేకత ఉన్నది.
More Stories
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
రాహుల్ తో చర్చకు బిజెపి రాయబరేలి యువనేత!
చాబహార్ పోర్ట్పై భారత్ – ఇరాన్ ల మధ్య చారిత్రక ఒప్పందం