
మన దేశ ఆర్థిక వ్యవస్థ 2019లో బ్రిటన్ను వెనుకకు నెట్టి ఐదో స్థానానికి చేరిందని శనివారం విడుదలైన సీఈబీఆర్ వార్షిక నివేదిక పేర్కొంది. అయితే 2020లో బ్రిటన్ మళ్ళీ ఐదో స్థానానికి చేరడంతో మన దేశం 6వ స్థానానికి పతనమైందని తెలిపింది.
కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో భారత దేశం కాస్త గాడి తప్పిందని, ఫలితంగా 2019లో బ్రిటన్ను అధిగమించిన తర్వాత, మళ్ళీ బ్రిటన్ ఈ ఏడాది భారత్ను అధిగమించిందని పేర్కొంది. భారత్ ఈ స్థానాన్ని ఆక్రమించే వరకు అంటే, 2024 వరకు బ్రిటన్ 5వ స్థానంలో ఉంటుందని అంచనా వేసింది.
భారత దేశ కరెన్సీ రూపాయి విలువ బలహీనపడినందు వల్ల ఆ దేశాన్ని బ్రిటన్ అధిగమించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2021లో 9 శాతం, 2022లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. భారత దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందిన దేశం కాబోతోందని పేర్కొంది.
వార్షిక జీడీపీ వృద్ధి 2035లో 5.8 శాతం ఉంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయని తెలిపింది. 2030నాటికి భారత దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. 2025లో బ్రిటన్ను, 2027లో జర్మనీని, 2030లో జపాన్ను అధిగమించి మూడో స్థానానికి భారత్ చేరుతుందని అంచనా వేసింది.
చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెంబర్ వన్ స్థానానికి 2028లో చేరుతుందని అంచనా వేసింది. అమెరికాను మించి చైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి ఈ రెండు దేశాలు కోలుకోవడంలో వ్యత్యాసాలున్నట్లు వివరించింది. అంతకుముందు అంచనాలకు విరుద్ధంగా ఐదేళ్ళు ముందుగానే చైనా నెంబర్ వన్ స్థానానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపింది.
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
ఆధార్పై మూడీస్ ఆరోపణలు నిరాధారం
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు