ఈ నేపథ్యంలో బండి సంజయ్ శనివారం మాట్లాడుతూ.. ‘‘భైంసా లో హిందువుల ఇళ్లను దగ్ధం చేస్తే పట్టించుకోలేదు. ఎంఐఎం గుండాలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. నానాయాగీ చేస్తున్నారు. అయినా హోం మంత్రి స్పందించడం లేదు’’ అని విమర్శించారు.
హైదరాబాద్లోని పాతబస్తీలో కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ఎంఐఎం కుట్ర చేస్తోంది. ఎండోమెంట్ స్థలాలను కాపాడాలని బీజేపీ నేతలు కోరితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎవరి కోసం పని చేస్తున్నారన ప్రశ్నించారు.
ఫసల్ బీమా యోజన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారబు అబీటీ ఒకసారి సీఎం ఫాంహౌజ్ను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. పదే పదే ఆయన అక్కడికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందిని చెప్పారు.
తెలంగాణలోని యూనివర్సిటీలను నిర్విర్యం చేస్తున్నారని అంటూ రెండేళ్లైనా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. 2023లో ప్రజలే మీకే పెన్షన్ ఇస్తారని సంజయ్ హెచ్చరించారు. ఇక టీఆర్ఎస్ నేతల విమర్శలకు బదులిస్తూ ప్రధాని ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులు ఎక్కడికి పోయాయి.. బీజేపీ గాల్లో గెలించిందో.. టీఆర్ఎస్ గాల్లో కొట్టుకుపోతుందా.. అనేది అందరూ చూస్తున్నారని అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ను జైల్లో పెట్టే రోజు త్వరలో వస్తుంది. ఆయన జైలుకు పోవడం ఖాయం. కేసీఆర్ లేని తెలంగాణ కావాలని ప్రజలు భావిస్తున్నారు. అది బీజేపీ వల్లే సాధ్యం అని స్పష్టం చేశారు. కాగా కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ నేడు బీజేపీలో చేరారు. ని హెద్దేవా చేశారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్ఐబీ చీఫ్ కోసం పిటిషన్