
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో సీబీఐ సోదాలు ముగిశాయి. గుంటూరు, హైదరాబాద్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఏకంగా 7 గంటల పాటు విచారణ కొనసాగించారు.
ట్రాన్స్రాయ్ సంస్థ బెంగళూరులోని కెనరా బ్యాంక్కు రుణాలు చెల్లించలేదు. ఇందులో భాగంగానే కెనరా బ్యాంకు ఉద్యోగులతో కలిసే సీబీఐ అధికారులు రాయపాటి నివాసాలకు చేరుకున్నారు.
ఈ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై, ట్రాన్స్ట్రాయ్ సంస్థతో ఉన్న సంబంధాలపై రాయపాటిని సీబీఐ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెనరా బ్యాంకు నోటీసు కాపీలను సీబీఐ తీసుకెళ్లింది.
దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణకు రాయపాటి కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించారు. ఈ విచారణలో రాయపాటి స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సీబీఐ సోదాలు… సాయంత్రం 3 గంటల వరకు నిరాటంకంగా ఈ సోదాలు సాగాయి.
More Stories
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని