రైతుల మేలు కోసమే కేంద్రంలోని బీజేపీప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా మాట్లాడుతూ ఈ చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులను బలోపేతం చేయడం, వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు తేవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన తెలిపారు.
అవసరమైతే రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కొంతమంది కావాలని ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు.
వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతులకు తుపాన్ నష్టపరిహారం రూ.35 వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కౌలు రైతులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పంటనష్టంపై నివేదిక తయారు చేసి సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని తెలిపారు.
మద్యం, ఇసుకలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గడిస్తోందని, అయితే రైతుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని జనసేన అధినేత ధ్వజమెత్తారు. జైకిసాన్ పేరుతో రైతుల కోసం కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. రైతులకు అండగా ఉండేలా ఒక ప్రణాళికతో ముందుకెళ్తానని వెల్లడించాయిరు. రైతులకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర రావాలని స్పష్టం చేశారు. కాగా, రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని పవన్ చెప్పారు.
More Stories
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు
2 పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల
అంగన్వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ విధులు