ఆస్ట్రేలియా-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో తాజాగా ఓ ట్వీట్ వివాదం అగ్నికి ఆజ్యం పోసింది. ఆస్ట్రేలియా రక్షణ దళాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఆ ట్వీట్ను తొలగించాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ డిమాండ్ చేశారు.
ఒక అభ్యంతరకరమైన కల్పిత ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసినందుకు చైనా ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్లో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిజియాన్ ఒక ఫొటోను పోస్టు చేశారు. ఆ గ్రాఫిక్ ఫొటోలో గొర్రె పిల్లను పట్టుకున్న ఓ ఆఫ్ఘాన్ బాలుడి గొంతులో ఆస్ట్రేలియా సైనికుడు నెత్తురోడుతున్న కత్తిని దింపుతున్నట్లుంది. ఇది ఆస్ట్రేలియా ఆగ్రహానికి కారణమైంది. ఈ ఫొటో అబద్ధమని మోరిసన్ మండిపడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లపై పోరాడిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలో ఆస్ట్రేలియా దళాలు కూడా పాలుపంచుకున్నాయి. ఆ సమయంలో (2009-2013 మధ్య) 39 మంది అమాయకులను అన్యాయంగా చంపేయడంలో ఆస్ట్రేలియా ప్రత్యేక దళాల పాత్ర ఉందని యుద్ధ నేరాలపై ఆస్ట్రేలియా భద్రతా దళాల అధిపతి ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో లిజియాన్ ట్విట్టర్లో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ ఫొటోను పోస్టు చేశారు. ‘ఆఫ్ఘాన్ పౌరులు, ఖైదీలను ఆస్ట్రేలియా సైనికులు హత్య చేయడం షాక్కు గురిచేసింది. ఇటువంటి చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ సైనికులను విడిచిపెట్టకూడదు’ అని ఫొటోతో పాటు రాశారు.
అయితే, చైనా అబద్ధాలను ప్రచారం చేస్తోందని మోరిసన్ భగ్గుమన్నారు. మరోవైపు, ఆస్ట్రేలియా ప్రభుత్వం చైనా రాయబారిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడిగింది.
More Stories
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
భారత్ తో వాణిజ్య సంబంధాలకై పాక్ ప్రధానిపై వత్తిడి