భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను శనివారం అభినందించారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి)తో కలిసి పని చేస్తోందని తెలిపారు. 

మూడు నగరాల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చని ఆయన నేరుగా భారత్‌ బయెటెక్‌కి వెళ్లారు. కరోనా వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్షించారు. వాక్సిన్‌ తయారీ కోసం అహర్నిహలు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలతో మోదీ సమీక్షించారు. వ్యాక్సిన్‌ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడి జైడస్ బయోటెక్ పార్క్‌ సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం అహ్మదాబాద్‌ నుంచి నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు.

మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. మోదీ హైదరాబాద్ నుంచి పుణే బయల్దేరారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ పురోగతిని సమీక్షించారు.