రోహింగ్యాల ఓట్లపై ఆధారపడిన టీఆర్ఎస్, ఎంఐఎం 

బంగ్లాదేశ్ నుండి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలకు హైదరాబాద్ లో ఆశ్రయం కల్పించారి.. వారికి ఓటు హక్కు కూడా కల్పించి కాపాడుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా  హైదరాబాద్ లో స్పష్టం చేశారు.

 గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె మీడియా సమావేశంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పుటు కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తే  మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో జోడీ కట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎంఐఎం-టీఆర్ఎస్ అవినీతి కూటమికి గ్రేటర్ ఎన్నికల్లో  ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు. కేసీఆర్ కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ కూడా వేసిందని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ లో ఓటమి భయం స్పష్టంగా కనపడుతోందని ఆమె పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ చొరబాటు దారులకు హైదరాబాద్ లో ఓటు హక్కు కల్పించి కాపాడుతున్న విషయం జాతీయ మీడియాతోపాటు, లోకల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వచ్చాయని,ఆడియో టేపులు సైతం టీవీల్లో ప్రసారమయ్యాయని ఆమె గుర్తు చేశారు. 

ఎంఐఎం లెటర్ హెడ్లు కూడా బయటపడినా రాష్ట్ర  ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోలేదని స్మ్రితి ఇరానీ మండిపడ్డాయిరు. చొరబాటు దారుల విషయంపై కేసీఆర్ పెదవి విప్పడం లేదని అంటూ  ఈ  విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. రోహింగ్యాల విషయంలో టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. రోహింగ్యాలపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.  

అక్రమ వలసదారులపైనే టీఆర్ఎస్ ఆధారపడిందని ఆమె ఆరోపించారు. చొరబాటుదారుల విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం చేసినదాని పేర్కొంటూ హైదరాబాద్ లో 75 వేలకుపైగా అక్రమ చొరబాటుదారులు వచ్చారని ఆమె చెప్పారు.  తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.224 కోట్లు ఇచ్చినా కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని స్మృతి ఇరానీ విమర్శించారు.

టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూనే ఉందని, అందుకే బీజేపీ కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై అధికార టీఆర్‌ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని, దుబ్బాకలో కూడా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 75 వేల అక్రమ కట్టడాలు వెలిశాయని, అవన్నీ టీఆర్‌ఎస్, ఎంఐఎం భాగస్వామ్యంతోనే వెలిశాయని విమర్శించారు.

 వరద నష్టంపై ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికలనే కేంద్రానికి పంపలేదని ఆమె దుయ్యబట్టారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసి ఉంటే కరోనా సోకిన పేదలకు చాలా లాభం చేకూరి ఉండేదని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.