తమిళనాడులోని తూత్తుకుడిలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ నెల 17న ప్రారంభమైన సోదాల్లో శ్రీలంక పడవలో 100 కేజీల హెరాయిన్ సహా ఇతర మాదక ద్రవ్యాలను ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది.
సుదీర్ఘమైన, నిలకడతో కూడిన కృషి అనంతరం చర్య తీసుకోదగిన నిఘా సమాచారం ఆధారంగా ఈ సోదాలను నిర్వహించారు. తూత్తుకుడికి దక్షిణ ప్రాంతంలో ఈ సోదాలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కరాచీ నుంచి వచ్చిన పాకిస్థానీ నాటు పడవలోని మాదక ద్రవ్యాలను శ్రీలంక నౌకలోకి ఎక్కించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మాదక ద్రవ్యాలు శ్రీలంక నుంచి పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు రవాణా అవుతున్నట్లు గుర్తించారు.
పాకిస్థాన్ జీహాద్ను మాత్రమే కాకుండా మాదక ద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నిధులను ఉగ్రవాదానికి ఉపయోగిస్తోందని ఆరోపించారు.
శ్రీలంక పడవలో 100 కేజీల హెరాయిన్, 20 చిన్న పెట్టెల్లోని సింథటిక్ డ్రగ్స్, 9ఎంఎం పిస్తోళ్లు 5, ఒక తురయ సెట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఓ ఖాళీ ఫ్యూయర్ ట్యాంక్లో దొరికినట్లు తెలిపారు. ఈ పడవలోని ఆరుగురు సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. వీరిని ప్రశ్నిస్తుండగా శ్రీలంక నావికా దళం నుంచి కూడా ఓ సందేశం వచ్చినట్లు చెప్పారు.
More Stories
త్వరలో సాటిలైట్ ఆధారిత టోల్ వసూలు
బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్
ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగింపు