
ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల రవాణా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించాయని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటూ భారత్ వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ నేడు ప్రపంచానికి ఓ శక్తి గుణకంగా మారిందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ హాజరయ్యారు. సభ్య దేశాలు ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించాలని చైనా, పాకిస్తాన్ లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సూచిం చారు.
ఐకరాజ్యసమితి 75 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించినప్పటికీ, ఐకరాజ్య సమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్ట సమయంలో భారత్లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందులను అందజేసిందని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే అందరికంటే మెరుగైన టీకా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మొత్తం మానవాళికి సహాయపడటానికి భారత్ తన టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నదని మోదీ తెలిపారు.
More Stories
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై సౌదీ అరేబియాలో నేడే శాంతి చర్చలు
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు