ఆర్మీ అధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లు మృతి 

జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  మచిల్‌ సెక్టార్‌లో సరిహద్దు రేఖ వెంబడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ చేపడుతుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి.
ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను..ఆర్మీ, బిఎస్‌ఎఫ్‌ బృందాలు అడ్డుకునే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.
ఈ ఘటనలో ఆర్మీ అధికారి, బిఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ సుదీప్‌ సర్కార్‌..మరో ఇద్దరు జవాన్లు మరణించారు. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.