
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికలలో ఎట్లాగైనా గెలుపు సాధించాలని అధికార పక్షం పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పిస్తున్నట్లు తెలుస్తున్నది. నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం బోగస్ అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో 2.89 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈసారి అనూహ్యంగా 4.15 లక్షల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్లో పెద్దసంఖ్యలో అప్లికేషన్లు రిజెక్ట్ అవుతుండటం చర్చనీయాంశమైంది. ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తున్న అధికారులపై రాజకీయ వత్తిడి పెరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఓటర్ల చేర్పింపు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని, వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చాలని ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ హైకమాండ్ఆదేశాలు జారీచేసింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ నేతలు జోరుగా ఓటర్లను చేర్పించారు.
గ్రాడ్యుయేట్లకు ఎన్రోల్మెంట్ ఫారాలు అందజేసి తిరిగి వాటినివసూలు చేయడంతోపాటు, ప్రత్యేక క్యాంపు ఆఫీసులు పెట్టి మరీ ఆన్లైన్లో చేర్పించారు. ఈ క్రమంలో ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులలో చాలా వరకు బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా అధికార పార్టీ ఈ తరహా బోగస్ ఓటర్ల నమోదుకు పాల్పడిందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు కూడా అందాయి. ఓటర్ల చేర్పింపు నేటితో ముగుస్తున్నందున ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రకియను పారదర్శకంగా చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్చేస్తున్నాయి.
నల్గొండ– ఖమ్మం– వరంగల్ సెగ్మెంట్లో ఈ నెల 4 నాటికి 4.15 లక్షల మంది ఎన్రోల్చేసుకున్నారు. వీటిలో ఆన్లైన్ దరఖాస్తులు 3 లక్షల 32 వేల 56 9 రాగా.. ఆఫ్లైన్లో కేవలం 82 వేల 541 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పటివరకు బీఎల్వోలు సుమారు లక్ష ఫారాలపై పరిశీలన పూర్తి చేశారు. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్లు 22,035 ఉన్నాయి.
మొత్తం 1,070 ఫారాలను రిజెక్ట్ చేయగా,వాటిలో ఆఫ్లైన్ ఫారాలు 150, మిగిలిన 920 ఆన్లైన్ఫారాలు. వీటిలో చాలా దరఖాస్తులలో బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులు మాత్రం బయటకు చెప్పడం లేదు.
ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్లో డిగ్రీ సర్టిఫికెట్లపైన ఫొటోలు సరిగ్గా లేకపోవడం, తప్పుడు అడ్రస్లు, డిగ్రీ ఫెయిల్ అయినవాళ్ల సర్టిఫికెట్లు కనిపిస్తున్నాయని, 2017 తర్వాత డిగ్రీ పాసైన వాళ్లు కూడా అప్లై చేశారని బీఎల్వోలు చెబుతున్నారు.
కాగా, నకిలీ సర్టిఫికెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని బీఎ ల్వోలు ఓకే చేసిన ఫారాలపై తహశీల్దారు ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్లు తప్పనిసరిగా గెజిటెడ్ సంతకం పెట్టాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. బోగస్ ఓటర్ల ఏరివేత కోసం తహసీల్ ఆఫీసుల్లో డిజిగ్నేటెడ్ఆఫీసర్ల హోదాలో డీటీలను నియమించామని చెబుతున్నారు.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు