నేపాల్ భూమిని ఆక్రమిస్తున్న చైనా… భారత్ హెచ్చరిక   

సరిహద్దులో ఉన్న ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న పలు చోట్ల నేపాల్ భూములను చైనా అక్రమంగా ఆక్రమించింది. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు న్యూఢిల్లీలో నేపాల్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఆక్రమణలు జరిగే అవకాశం ఉన్నదని నేపాల్ ను భారత్ అప్రమత్తం చేసింది.
చైనా వేగంగా ముందుకు సాగుతున్నదని, మరింత ఎక్కువ భూభాగాలను ఆక్రమించడం ద్వారా నేపాలీ సరిహద్దులను మరింత ముందుకు తెస్తున్నదని ఏజెన్సీలు వెల్లడించాయి. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) యొక్క విస్తరణవాద ఎజెండాను కాపాడటానికి ప్రయత్నిస్తున్నందున వాస్తవ దృశ్యం అధ్వాన్నంగా ఉన్నదని అంతర్గత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక ఎత్తి చూపింది.
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి ముందు తమ భూమిని స్వాధీనం చేసుకుంటున్న చైనా చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోకుండా నేపాల్ సర్వే విభాగం ఫ్లాగ్ చేయడం గురించి ఈ నివేదికలో చర్చ జరిగింది. చైనా భూకబ్జా పథకానికి బాధితులుగా ఉన్న నేపాలీ జిల్లాల్లో డోలఖా, గూర్ఖా, దర్చులా, హమ్లా, సింధుపాల్‌చౌక్, సంఖువాసభ, రసూవా ఉన్నాయి.
అంతకుముందు కొర్లాంగ్ పైభాగంలో ఉన్న డోలఖాలోని కోర్లాంగ్ ప్రాంతంలో సరిహద్దు స్తంభాల సంఖ్య 57 కు నెట్టడం సహా అంతర్జాతీయ సరిహద్దును 1,500 మీటర్ల దూరం డోలాఖాలో చైనా నెట్టింది. డోలఖా మాదిరిగానే, చైనా గూర్ఖా జిల్లాలో సరిహద్దు స్తంభాల సంఖ్య 35, 37, 38.. అలాగే, సోలుఖంబులోని నాంపా భన్జ్యాంగ్‌లో సరిహద్దు స్తంభాల సంఖ్య 62 ని మార్చారు.
మొదటి మూడు స్తంభాలు రూయి గ్రామంలో, టామ్ నది ప్రాంతంలో ఉన్నాయి. నేపాల్ యొక్క అధికారిక పటం ఈ గ్రామాన్ని నేపాలీ భూభాగంలో భాగంగా చూపించినప్పటికీ, గ్రామ పౌరులు నేపాల్ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించి 2017 లో చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లో విలీనం చేసింది.
నేపాల్‌లో భాగంగా ఉండే అనేక ఇండ్లను ఇప్పుడు చైనా స్వాధీనం చేసుకుని చైనా భూభాగంలోకి కలిపేసుకున్నది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల చైనా భూకబ్జా కేసులను ఎత్తిచూపే నివేదికను తీసుకువచ్చింది. నాలుగు నేపాలీ జిల్లాల పరిధిలోకి వచ్చే కనీసం 11 ప్రదేశాలలో చైనా నేపాలీ భూమిని ఆక్రమించినట్లు మంత్రిత్వ శాఖ నివేదించింది.
ఈ జిల్లాల్లో ఆక్రమించిన ప్రాంతాలు చాలావరకు నదీ పరీవాహక ప్రాంతాలు. వీటిలో హమ్లాలోని భగదారే నది, కర్నాలి నది, సంజెన్ నది, రసూవాలోని లెమ్డే నది ఉన్నాయి. భుర్జుగ్ నది, ఖరణే నది, సింధుపాల్‌చౌక్‌లోని జంబు నది, భోతేకోషి నది, శంఖువాసభలోని సంజుగ్ నది కంఖోలా నది, అరుణ్ నది ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేపాల్ ప్రభుత్వం తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా చైనాను కించపరచడానికి ఇష్టపడనందున 2005 నుంచి నేపాల్.. చైనాతో సరిహద్దు చర్చలతో ముందుకు సాగడం లేదని ఫ్లాగ్ చేసింది.