
బీహార్లో కరోనా వ్యాక్సిన్ని అందరికీ ఉచితంగా ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఆమె బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో వ్యాక్సిన్ అందరికీ ఫ్రీగా ఇస్తామని తెలిపారు.
తమ కూటమి పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. బీహార్లో ప్రతి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని ఆమె చెప్పారు సీతారామన్.
ఎన్డీఏను రాష్ట్రప్రజలు గెలిపించాలని కోరుతూ బీహార్లో మరో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాలనలోనే బీహార్ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు.
బీహార్లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తయారు చేయడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి పక్కా ఇళ్లు, 9 తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది.
అంతేకాదు.. ఇతర రాష్ట్రాలలో చనిపోయిన వలస కూలీ కుటుంబానికి రూ 2 లక్షల ఎక్స్గ్రేషియా దిస్తామని బిజెపి తెలిపింది. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి రూ 25 లక్షల ఆర్థిక సాయం, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు.
More Stories
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కంచి కామకోటి పీఠాధిపతిగా గణేష శర్మ
పరువునష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్టు, విడుదల