![](https://nijamtoday.com/wp-content/uploads/2020/09/Somu-Veerraju4-1024x768.jpg)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజును ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఛలో అమలాపురం’ కార్యక్రమానికి సోమువీర్రాజు బయల్దేరగా ఆయనను విజయవాడలో పోలీసులు అడ్డుకున్నారు.
అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఛలో అమలాపురం నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు.
ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. అయితే గ్రామ వాలంటీర్ల ద్వారా బీజేపీ కార్యకర్తల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్యకంగా తీసుకున్నామని వీర్రాజు చెబుతున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఐదు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొంటారని వీర్రాజు ప్రకటిం\చారు.
ఇప్పటికే బీజేపీ నేత విష్ణుకుమార్రాజును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంతర్వేది సందర్శనకు వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా నోటీసు ఇచ్చి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
More Stories
వైసిపి ఆర్ధిక దోపిడీతో ఏపీకి రూ. 76,795 కోట్ల నష్టం
కాంట్రాక్టర్లను మార్చడంతోనే పోలవరం పనుల్లో జాప్యం
వివేకా హత్యకేసులో దస్తగిరి సాక్షి మాత్రమే