ఏపీ పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏపీలో పోలీస్ వ్యవస్ద గాడితప్పుతుందని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో `చట్టబద్ధ పాలన‘ అమలు కావడం లేదని కోర్టు మరోసారి మండిపడింది.
గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని హైకోర్టు ఒకింత కన్నెర్రజేసింది.!.
అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అదృశ్యంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. బాధితుడి మేనమామ సుంకర నారాయణ స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. వెంకటరాజు విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది.
గతంలో మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. అలాగే ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

More Stories
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్