వుహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ తయారీ 

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ సహజ సిద్ధంగా ఏర్పడలేదని, వుహాన్‌ ల్యాబ్‌లోనే దాన్ని తయారు చేశారని చైనాకు చెందిన వైరాలజిస్ట్‌ డాక్టర్‌ లీ మెంగ్‌ యాన్‌ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని చైనా అధికారులు దాచిపెడుతున్నారని, దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను త్వరలోనే బయటపెడుతానని ఆమె ప్రకటించారు. 

కరోనా జన్యుక్రమం మానవుడి వేలిముద్రను పోలి ఉంటుందని, ఈ ప్రత్యేకత కారణంగా వైరస్‌ను  ప్రయోగశాలలో తయారు చేసినట్టు నిరూపించవచ్చునని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న యాన్‌ తనకు చైనా ప్రభుత్వం నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు  ఆందోళన వ్యక్తం చేశారు. 

చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ అవున‌న్నా కాద‌న్న ఇదే నిజమని, క‌రోనా వైర‌స్ వెట్ మార్కెట్ నుంచి వ్యాపించ‌లేద‌ని ఆమె స్పష్టం చేశారు.   న్యూస్ 18క‌థ‌నం ప్ర‌కారం.. క‌రోనా వైర‌స్ వుహాన్ లోని వెట్ మార్కెట్ నుంచి వ్యాపించింద‌ని, వుహాన్ ల్యాబ్ లో త‌యారు కాలేద‌ని చైనా వాదిస్తుంది. 

ఆ వాద‌న‌పై ప్ర‌పంచ దేశాల‌కు చెందిన నిపుణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారిలో చైనా వైరాజిస్ట్ లు ఉన్నారు. ఆరోపించిన వైరాల‌జిస్ట్ ల్ని చైనా ప్ర‌భుత్వం హ‌త‌మార్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా హాంకాంగ్ కు చెందిన వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ లి మెంగ్ యాన్ మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ పై తాను ప‌రిశోధ‌న‌లు చేసిన‌ట్లు తెలిపింది. డిసెంబ‌ర్ నెల‌లో హాంగ్ కాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప‌నిచేస్తున్న‌ప్పుడు చైనా లో పుట్టిన వైర‌స్ గురించి ద‌ర్యాప్తు చేయాల‌ని త‌న పై అధికారిని కోరాన‌ని, ఆయ‌న చైనా ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపి త‌న‌ని బెదిరించిన‌ట్లు చెప్పింది.

ప‌రిశోధ‌న‌ల గురించి బ‌య‌ట‌కు చెబితే త‌న‌ని హ‌త‌మారుస్తామాన్నారని ఆమె తెలిపారు. కానీ ఈ విష‌యం గురించి తాను మౌనంగా ఉండ‌లేక‌పోయానని, అందుకే క‌రోనా గురించి బ‌హిర్ఘ‌తం చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. ఆ త‌రువాత చైనా నుంచి బెదిరింపులు ఎక్కువ కావ‌డంతో భ‌ద్ర‌త కోసం హాంకాంగ్ నుంచి అమెరికా వ‌చ్చిన‌ట్లు వైరాల‌జిస్ట్ చెప్పారు.