
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం తాను డ్రగ్స్ కొన్నానని బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కొనేందుకు తన సోదరుడు షోవిక్ చక్రవర్తి సాయం చేశాడని చెప్పినట్టు సమాచారం. జైద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన శామ్యూల్ మిరాండా తనకు ముందే తెలుసని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు రియా చెప్పినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
తన సోదరుడు షోవిక్తో కలిసి డ్రగ్స్ అమ్మే జైద్తో కో ఆర్డినేట్ చేసినట్టు ఆమె చెప్పిందంటున్నారు. అయితే, తాను నేరుగా సుశాంత్కు డ్రగ్స్ ఇవ్వలేదని అధికారులకు చెప్పినట్టు సమాచారం. రియాను ఎన్ సీబీ అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్ సీబీ ఆఫీసుకు వచ్చిన రియా.. సాయంత్రం 6 గంటలకు పోలీసుల ఎస్కార్ట్ తో ఇంటికి వెళ్లిపోయారు.
రియాను సోమవారం మరోసారి ప్రశ్నిస్తామని, ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని ఎన్ సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సౌత్ వెస్ట్ రీజియన్ ) ముఠా అశోక్ జైన్ చెప్పారు. అనూజ్ కేశ్వానీ ఇంటిపై దాడులు చేసినట్లు తెలిపారు. విచారణ సందర్భంగా కైజన్ ఇబ్రహీం అనూజ్ గురించి చెప్పారని పేర్కొన్నారు.
అనూజ్ ఇంట్లో 590 గ్రాములి హాషిష్, 0.64 గ్రాముల ఎల్ ఎస్ డీ షీట్లు, 304 గ్రాముల మరీజునా, ఇంపోర్టెడ్ క్యాప్సూల్స్, రూ.1.85 లక్షల క్యాష్, ఇండోనేషియన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు