
ఎస్సీఓ రీజియన్లో శాంతిభద్రతల కోసం అంతర్జాతీయ నియమ, నిబంధనలను గౌరవించే విశ్వసనీయ, సహకారాత్మక, విరోధం లేనటువంటి వాతావరణం అవసరమని పిలుపిచ్చారు. ఎస్సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా ఉందని తెలిపారు.
‘ఈ ప్రాంతంలో అందరి భద్రత, వృద్ధి మన లక్ష్యం కావాలి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో వేరే సందర్భంలో చెప్పారని గుర్తు చేశారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ నేరాలు వంటివాటిని ఎదుర్కొనేందుకు సంస్థాగత సామర్థ్యం అవసరమని చెప్పారు.
అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని భారత దేశం నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని, ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఎస్సీఓ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ కృషి చాలా విలువైనదని చెప్పారు. రాడికలిజం, అతివాదం వ్యాపించకుండా చేసిన కృషిని ప్రశంసించారు. రాజ్నాథ్ సింగ్ర మూడు రోజుల రష్యా పర్యటన ఈ నెల 3న ప్రారంభమైంది.
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
ఔట్ సోర్సింగ్ నియామకాలతోనే పేపర్ లీకేజి!