
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో పాటు మరో 118 చైనా మొబైల్ యాప్స్పై నిషేధం విధిస్తూ భారత సమాచారసాంకేతిక శాఖ నిర్ణయం తీసుకుంది.
పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో భారత్లో ఈ గేమింగ్ యాప్ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.
పబ్జీతో పాటు బైడు, క్యామ్కార్డ్, విచాట్ రీడింగ్, టెన్సెంట్ వీన్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్ వంటి పలు యాప్లను ప్రభుత్వం నిషేధించింది. పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
ఈ గేమ్కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. ఇక సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా భద్రతా కారణాలతో టిక్టాక్ సహా 106 చైనా యాప్లను ఇటీవల భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం
అసలు బంగారమే స్వాధీనం చేసుకోలేదు… రన్యా రావు