ఆహార సంక్షోభంలో చిక్కుకున్న చైనా!

 
ఒక వంక కరోనా మహమ్మారితో అంతర్జాతీయంగా తీవ్ర ప్రతిఘటనను  ఎదుర్కొంటుండగా, ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతూ ఉండగా  ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా మరోవంక తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ సమస్య నుంచి ప్రజల ద`ష్టి మళ్లించేందుకు సరిహద్దుల్లో ఉద్రిక్తలు సృష్టిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
తమ దేశ ప్రజల దృష్టి మళ్లించడం కోసం భారత్ తో సరిహద్దులో   కావాలనే కయ్యాలు పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తోందని నిపుణులు కూడా చెబుతున్నారు. అప్పట్లో మావో జెడాంగ్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జిన్ పింగ్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది.

చైనా ఆహార సంక్షోభంలో చిక్కుకుందని స్వయానా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ మధ్య ప్రకటించారు. 2013 నాటి ‘క్లీన్ యువర్ ప్లేట్’ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. దేశం వరుసగా సమృద్ధిగా ఆహారోత్పత్తి చేస్తున్నా ఆహరం కొరత ఉన్నదనే భావనతో వ్యవహరించాలని ప్రజలను కోరారు. దేశంలో ఆహారం వృద్దా పెరిగిపోతున్నదని అంటి ఆందోళన వ్యక్తం చేశారు. 

మరోవంక చైనాలోని రెస్టారెంట్లు భోజనంలో వడ్డించే ఆహార పదార్ధాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయి. అలాగే మితంగా వద్దిపనున్నట్లు, వృద్దా ఆహారాన్ని తగ్గిస్తున్నట్లు కూడా చెబుతున్నాయి. 

తమ ప్రజల దృష్టి మళ్లించడం కోసమే చైనా భారత్ సరిహద్దులో పరిస్థితి చల్లారకుండా ఉద్రిక్తతలు కొనసాగేలా వ్యవహరిస్తున్నది. మొన్నటి గల్వాన్ గొడవ, నిన్నట పాంగోంగ్ సో లేక్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. మరోవైపు అమెరికాతోవాణిజ్య పోరు కారణంగా అక్కడి నుంచి ఆహార దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. 

కరోనా నేపథ్యంలో భారత్, వియత్నాం వరి ఎగుమతిపై ఆంక్షలు విధించాయి. మరోవైపు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల 100 మిలియన్ల పందులను చంపారు. ఇదే ఆహార సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఎరుగని విధంగా దక్షిణ చైనా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. 

3,900 మైళ్ళ పొడవైన యాంజిటీజ్ నది, దాని ఉపనదులు పొంగడంతో 1.30 కోట్ల ఎకరాలలో పంట నష్టపోయిన్నట్లు చెబుతున్నారు. దేశంలో 70 శాతం వారి ఉత్పత్తి ఈ నది కిందనే జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకొంటే ఆహార పదార్ధాల ధరలు 10 నుండి 30 శాతం వరకు పెరిగాయి. 

1962లో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్ మూమెంట్’ను నాటి దేశాధినేత మావో జెడాంగ్ తీసుకువచ్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతో మంది చనిపోయారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్ ను  మావో ఈజీ టార్గెట్ గా చేసుకున్నారు. 1962లో మనతో సరిహద్దు వివాదాన్ని స`ష్టించారు. 

ఇప్పుడు జిన్ పింగ్ కూడా ఆహార సంక్షోభ సమస్యను పరిష్కరించలేక, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, దృష్టి మరల్చేందుకు సరిహద్దు  అంశాన్ని లేవనెత్తారు. ఆయనకు అక్కడి ప్రభుత్వ మీడియా వంతపాడుతోంది. కొన్ని ప్రావిన్స్‌‌ లలో పంట నష్టం వల్ల ఏర్పడిన ఆహార సంక్షోభంపై ఎలాంటి వార్తలూ ప్రచురించడం లేదు. 

పైగా ఆహార ఉత్పత్తిపై కరోనా, మిడతల దాడి ప్రభావాన్ని ప్రభుత్వం సమర్థంగా నియంత్రించినట్లు డబ్బా కొట్టింది. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోతున్నా పరిస్థితి అదుపులోనే ఉందని ప్రచారం చేస్తోంది.