
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ప్రకటించారు. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.
ఉపాధ్యక్షులు: మాజీ మంత్రి కె విజయరామారావు, మాజీ ఎమ్యెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్రెడ్డి లతో పాటు మనోహర్రెడ్డి, బండారు శోభారాణి
ప్రధాన కార్యదర్శులు: ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు
కార్యదర్శులు: రఘునందన్రావు, ప్రకాశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, బొమ్మ జయశ్రీ;, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి
కోశాధికారులు: బండారి శాంతికుమార్, బవర్లాల్ వర్మ (జాయింట్ ట్రెజరర్). కార్యాలయ కార్యదర్శి ఉమా శంకర్
More Stories
సైబర్ నేరగాళ్ల చేతిలో 16.80 కోట్ల మంది పర్సనల్ డేటా
సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు